AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిన్న ఐస్‌క్రీం, నేడు పాలు.. యథేచ్ఛగా కల్తీ వ్యాపారం

నగరంలో ప్రతి వస్తువు కల్తీ మయం అవుతోంది. నిన్నటి వరకు ఐస్‌క్రీమ్‌.. నేడు పాలు.. ఒక్కటేమిటీ అన్నింట్లో కల్తీ రాజ్యమేలుతోంది. తాజాగా యాదాద్రి జిల్లా భీమనపల్లిలో పాల వ్యాపారి మహేందర్‌ వద్ద ఏకంగా 80 లీటర్ల కల్తీపాలు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ప్రమాదకర రసాయినాలతో పెద్దఎత్తున కల్తీ పాల తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. మహేందర్ అనే వ్యక్తి నుంచి 300మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ సీజ్‌ చేశారు. 10 కేజీల ధోల్పూర్ స్కీమ్ పాల పౌడర్ స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ పాలను తయారు చేసిన మార్కట్లో విక్రయిస్తున్నా వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం పాటు నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు స్వీట్స్ షాపులకు అతడు కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

దేశంలో పాల వినియోగానికి, పాల ఉత్పత్తికి ఏమాత్రం సంబంధం లేదు. డిమాండ్ వందశాతం ఉంటే.. ఉత్పత్తి 50శాతం లోపే. మరి మిగతా 50% పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అందుకు సమాధానమే ఇలాంటి కల్తీ పాలు. ఇళ్లలోకి, హోటళ్లలోని, టీస్టాళ్లలోకి రోజు వందలు, వేల లీటర్ల పాలు కావాలి. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకోడానికి మహేందర్ అనే వ్యక్తి పెట్టిన వ్యాపారమే కల్తీపాలు. ఒక్కరోజులో అతని నుంచి 80లీటర్లు స్వాధీనం చేసుకున్నారంటే అసలు ఎన్నిరోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడు. ఎన్ని వేలు లీటర్లు పాలు అమ్మాడు. ఆ కల్తీపాలను ఎంతమంది వినియోగించారు. ఎంతమంది అనారోగ్యం బారిన పడ్డారు. అనేది ఎవరికి ఊహకు కూడా అందని విషయం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10