పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ఉన్మాది. గుండ్ల సదానందం అనే వ్యక్తి 11 ఏళ్ల తన కన్న కూతురును గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అదే గడ్డలితో మరో దుకాణదారుడిపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే నిందితుడిని పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. నిందితుడిని తామే శిక్షిస్తామంటూ పోలీసు వాహనానికి ముళ్ల కంపలు అడ్డం వేసిన స్థానికులు. ఈ క్రమంలో పోలీసులతో గ్రామస్థులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసు వాహనంపై గ్రామస్తుల దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, నిందితుడు సదానందం గతంలో తన భార్యను ఉరివేసి చంపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు.