తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించలేదు. మొదటి సెషన్ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ పరీక్షలను మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహింస్తున్నారు.
ఈ పరీక్షల కోసం సుమారు 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు ఈనెల 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేశారు.