AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బల్కంపేట ఎల్లమ్మకు బంగారు కిరీటం

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయం దగ్గర దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూన్‌ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కళ్యాణం రోజున అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించనున్నట్టు తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తామన్నారు.ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారులకు షాపులను ఉచితంగా కేటాయించామని వెల్లడించారు. భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చేయిస్తున్నామని తెలిపారు. ఇలా 2.20 కిలోల బంగారంతో కిరీటం, ఇతర ఆభరణాలు తయారయ్యాయని మంత్రి తలసాని చెప్పారు.

ANN TOP 10