AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకుంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్‌ రాజీవరు నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్‌ అరుణ్‌కుమార్‌ ఆలయాన్ని తెరుస్తారని చెప్పారు.

ఈ పండుగలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 14న సంక్రాంతి నాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. మండల పూజ అనంతరం డిసెంబర్‌ 26న ఆలయాన్ని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో వేలాది భక్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10