తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చలి పులి పంజా విసురుతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మెదక్లో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 15.7 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరులో 16.2, దుండిగల్లో 18, నిజామాబాద్లో 18.7, రామగుండం, హనుమకొండ, హకీంపేటల్లో 19, హైదరాబాద్లో 19.1 డిగ్రీల సెల్సియస్గా నమోదనట్లు తెలిపారు. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం 32 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.