AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష తప్పనిసరి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత మరియు వేగం పెంచే లక్ష్యంతో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షను తప్పనిసరి చేస్తూ జీఓ నెం. 237ను జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం నిర్దేశిత కేటగిరీల ఉద్యోగులు కచ్చితంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఈ జీఓ ముఖ్యంగా క్లరికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి వర్తిస్తుంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, యూడీ, ఎల్డీ టైపిస్టులు వంటి ఉద్యోగులు ఉన్నారు. వీరంతా కంప్యూటర్ పరీక్ష పాస్ కావడంతో పాటు ఆఫీస్ ఆటోమేషన్ యంత్రాల వినియోగంలో కూడా నైపుణ్యం ప్రదర్శించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారికి సైతం కంప్యూటర్ పరిజ్ఞానం మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ పాలనను పటిష్ఠం చేయడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫైళ్ల నిర్వహణ, డేటా ఎంట్రీ వంటి పనులు వేగవంతం అవుతాయని ఆశిస్తున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ANN TOP 10