సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళలకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ నవ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ నుంచి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు.
కొంతకాలం క్రితం నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అనంతరం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.
వివాహం తర్వాత శోభిత సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటున్నారు. మరోవైపు నాగ చైతన్య, పెళ్లి తర్వాత విడుదలైన ‘తండేల్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ పౌరాణిక నేపథ్యం ఉన్న థ్రిల్లర్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో, చైతన్య-శోభిత జంట తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నారని, త్వరలోనే శోభిత గర్భవతి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే దానిపై స్పష్టత లేదు. ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబం గానీ, ఇటు శోభిత గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్త ప్రస్తుతం కేవలం ఊహాగానంగానే మిగిలిపోయింది. దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే అసలు విషయం తెలుస్తుంది.