AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జపాన్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్‌లో పర్యటించనుంది. జపాన్‌లోని భారత రాయబారి శింబు జార్జ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని వందేళ్ల నాటి ఇండియా హౌజ్‌లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు పాల్గొన్నారు.

 

రేపు టోక్యోలో సోని గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర బృందం తొషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10