AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు.. రెండు బోగీలు ద‌గ్ధం

త‌మిళ‌నాడులోని చెన్నై శివారులో శుక్ర‌వారం రాత్రి రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తిరువ‌ళ్లూరు స‌మీపంలోని కావ‌రిపెట్టై వ‌ద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెండు బోగీలు ద‌గ్ధ‌మ‌య్యాయి. మంట‌లు చెల‌రేగ‌డంతో ప‌లువురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డిన‌ట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలును మైసూర్ – ద‌ర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలుగా గుర్తించారు. ప‌ట్టాల‌పై నిల‌బ‌డి ఉన్న గూడ్స్ రైలును అతి వేగంతో వ‌చ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక నుంచి వ‌చ్చి ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప‌లు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఘ‌టనాస్థ‌లిలో రైల్వే అధికారులు, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బాధితుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10