హైదరాబాద్: మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని జంబారాహిల్స్లోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలతో కలిసి అక్కడి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఆయన నివాసంలోకి వెళ్లకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో బాల్కసుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాలరాజు యాదవ్, రాకేశ్ కుమార్తోపాటు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకితీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.









