AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిక.. బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌షాక్‌

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో హస్తం గూటికి..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడగా… తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్‌ చెప్పారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

ఆదివారం సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆçహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారని.. ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది.

ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడం, కాంగ్రెస్‌ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్‌ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు.

ANN TOP 10