AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాములోరి కల్యాణానికి ముహర్తం ఖరారు..

భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రం.. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.కలియుగ వైకుంఠం భద్రాచలంలో రాములోరి కల్యాణానికి మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. మార్చి 22వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకొని నూతన పంచాంగ శ్రవణం జరుపనున్నారు.

భద్రాచల రామయ్య పెండ్లికి ముహూర్తం ఖరారైంది. శ్రీ సీతారాముల కల్యాణం మార్చి 30న జరగనుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కల్యాణ క్రతువు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సీతారాముల కల్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాలు, కల్యాణం, పట్టాభిషేకాన్ని భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10