టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ఓ నిరుద్యోగి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నవీన్ అన్యే అభ్యర్థి ఏళ్లుగా కష్టపడి చదివి గ్రూప్ 1కు అర్హత సాధించడు. తీరా పరీక్ష రద్దు కావడంతో ఆ యువకుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దవడంతో ఇక తనకు ఉద్యోగం రాదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ల ముందు ఉన్న కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.
