AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ గారూ.. తైవాన్‌కు రండి

సీఎంకు యంగ్‌ లియూ లేఖ
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఛైర్మన్‌ యంగ్‌ లియూ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఎలక్ట్రానిక్‌ పార్క్‌ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు లేఖలో తెలిపారు. మిమ్మల్ని తైవాన్‌కు ఆహ్వానిస్తున్నానని, సమయం చూసుకుని తైవాన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.

‘మీరు నా పర్సనల్‌ గెస్ట్‌.. హైదరాబాద్‌లో నాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు. మీరు కూడా తైవాన్‌కు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. మీకు ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తా’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో యంగ్‌ లియూ పేర్కొన్నారు. కొంగరకలాన్‌లో ఎలక్ట్రానిక్‌ పార్క్‌కు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ పర్యటన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అతి త్వరలోనే ఎలక్ట్రానిక్‌ పార్క్‌ ఏర్పాటుకు అడుగులు వేయనున్నట్లు యంగ్‌ లియూ స్పష్టం చేశారు.

ఎలక్ట్రానిక్‌ పార్క్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు యంగ్‌ లియూ లేఖలో తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మీదో అద్భుతమైన సమయం గడిపానని, నాతో పాటు మా టీమ్‌కు మీరు అందించిన ఆతిథ్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పారు. అయితే ఇటీవల ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను యంగ్‌ లియూ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై చర్చించారు. ఎలక్ట్రానిక్‌ పార్కుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10