AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ ఎంపీ కేకే కుమారులపై భూకబ్జా కేసు

బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కె. కేశవరావు (KK) ఇద్దరు కుమారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో భూకబ్జా కేసు కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎన్బీటీనగర్‌ సర్వే నంబరు 129 లో షేక్‌ అలీఖాన్‌ అహ్మద్‌ నుంచి 939 గజాల స్థలాన్ని బంజారాహిల్స్‌కు చెందిన పి.సుదర్శన్‌రెడ్డి, జయమాల 1983లో కొనుగోలు చేశారు. సుదర్శన్ రెడ్డి 470 గజాలు, జయమాల 469 గజాల స్థలం చొప్పున కొన్నారు. సుదర్శన్‌రెడ్డి సౌత్ వైపు, జయమాల నార్త్ వైపు భాగాలు పంచుకున్నారు.

అనంతరం జయమాల అమెరికాలో స్థిరపడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 13లోని జయమాల నివసించిన ఇంటికి నవంబర్ 30, 2022న ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నోటీసు జారీ చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2,13,67,500లకు స్థలాన్ని విక్రయించారని.. పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి చెల్లించాల్సిన ట్యాక్స్, పెనాల్టీ.. రూ.1,40,41,300 చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న జయమాల.. వెంటనే హైదరాబాద్‌కు వచ్చారు. ఎంపీ కె.కేశవరావు కుమారుడు, తెలంగాణ స్టేట్‌ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ విప్లవ్‌కుమార్‌కు స్థలంపై అధికార హక్కులతో కూడిన స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ 2019లో తాను ఇచ్చినట్లు ఉన్న పత్రాలు జయమాల గుర్తించారు.

జులై 19, 2013లో ఆ స్థలాన్ని తన సోదరుడు కె.వెంకటేశ్వర్‌రావుకు రూ.3 లక్షలకు విక్రయించిన రిజిస్టర్‌ డాక్యుమెంట్లను సైతం ఆమె గుర్తించారు. తాను ఎవరికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలేదని.. స్థలాన్ని విక్రయించలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేసినట్లు జయమాల గుర్తించారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా.. ఫలితం లేకుండాపోయింది. ఆమ కంప్లైంట్ తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆమె మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. కోర్డు ఆదేశాలతో గతనెల 13న కేసు నమోదు చేసిన పోలీసులు..కేకే కుమారులు విప్లవ్‌ కుమార్‌ను ఏ-1గా, వెంకటేశ్వర్‌రావును ఏ-2గా చేర్చారు. భూకబ్జా ఆరోపణలపై విచారణ చేపడుతున్నారు.

ANN TOP 10