త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు
హైదరాబాద్ ఫిలింనగర్ దగ్గర రన్నింగ్లో ఉన్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అలెర్ట్ అయిన ఇద్దరు యువకులు కారులోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.









