AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్రూయిజర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఎనిమిది మంది మృతి

హర్యానాలోని బీబీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీజూర్‌లోని జింద్‌లో ఆర్టీసీ బస్సు క్రూయిజర్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో క్రూయిజర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి క్రూయిజర్‌ వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జింద్‌ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10