AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండి సంజయ్ మార్పు బాధాకరం.. విజయశాంతి

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించడం ఆయన అభిమానులతో పాటు పలువురు పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. బండి సంజయ్ మార్పుపై పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీనియర్ నాయకురాలు విజయశాంతి టీ బీజేపీలోని మార్పులపై స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. నిప్పులు పుట్టించే నడకను పార్టీకి రాష్ట్రంలో నేర్పిన బండి సంజయ్‌ను మార్చడం బాధాకరమని, ఆయనకు త్వరలో మరింత మంచి బాధ్యతను ఢిల్లీ అధిష్టానం అప్పగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే తమ కార్యకర్తల మనోభావాలను బీజేపీ అగ్రనాయకత్వం గుర్తిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌కు ట్విట్టర్‌లో విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై వార్తలు నిరంతరం వస్తున్నాయని, కానీ బండి సంజయ్ మార్పుకు కారణం మాత్రం ఎవ్వరూ పత్రికల్లో రాయడం లేదన్నారు. ధర్మం కోసం ప్రాణమిచ్చి పనిచేసే కార్యకర్తలకు తెలియచేయాల్సిన అవసరం పత్రికలకు, న్యూస్ మీడియాకు కొంచమైనా ఉంది కదా? అని ప్రశ్నించారు.

ANN TOP 10